కరోనా పుణ్యమా అని డిజిటల్ రంగం దినదినాభివృద్ది చెందుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ మాత్రమే జనాలకు సుపరిచితం. కాని ఇప్పుడు చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి. కరోనా వలన ప్రేక్షకులు థియేటర్స్కు వెళ్లలేని పరిస్థితి తలెత్తుతున్న నేపథ్యంలో నిర్మాతలు ఎక్కువగా ఓటీటీను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు బడా నిర్మాతలు కొత్త ఓటీటీలను మొదలు పెట్టేందుకు అడుగులు వేస్తున్నారు.
గత ఏడాది కాలం నుంచి డిజిటల్ కంటెంట్ ను ప్రేక్షకుల మరింత ఆదరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అరవింద్ ఆహా అనే స్ట్రీమింగ్ యాప్ స్టార్ట్ చేసి ఇందులో వెరైటీ ప్రోగ్రాంస్తో పాటు సినిమాలను స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని నాగార్జున కూడా డిజిటల్ ప్రపంచంలోకి అడుగు పెట్టనున్నట్టుగా టాక్ వినిపిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేతల అయిన నాగ్ తన స్నేహితులతో కలిసి త్వరలోనే ఓటీటీ యాప్ను స్టార్ట్ చేయనున్నట్టు ఫిలిం నగర్ టాక్. దీనిపై త్వరలోనే పూర్తి క్లారిటీ రానుంది. బిజినెస్ పరంగా నాగార్జునది ఎంత లక్కీ హ్యాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇవికూడా చదవండి..