నందికొండ: శ్రీశైలం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను ఎన్నెస్పీ అధికారులు కొనసాగిస్తున్నారు. గురువారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయగా క్రమంగా ఇన్ప్లో పెరగ డంతో డ్యాం 4 క్రస్ట్ గేట్ల ద్వారా 32400 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగుల మేరకు నీరు నిల్వ ఉం ది. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 7778 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 5297 క్యూసె క్కులు, ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా 33521 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడు దల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ రిజర్వాయర్కు 79796 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుండగా, అదే స్ధాయిలో అవుట్ఫ్లో కొనసాగుతుం ది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు 883.00 అడుగుల వద్ద 204.3520 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలంకు 49157 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది.