నందికొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఆధీనంలోకి తీసుకునే అంశాల పరిశీలనపై కేఆర్ యంబీకి నూతనంగా నియమితులైన సీఈలు శివరాజన్, ప్రసాద్లు, డీఈ త్రినాథ్లతో కూడిన బృందం నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ను బుధవారం సందర్శించారు. ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్తో కలసి నాగార్జునసాగర్ డ్యాం, క్రస్ట్ గేట్లు, గ్యాలరీ, జల విద్యుత్ కేంద్రాలు, ఎడమ, కుడి, వరద కాల్వలు, టైయిల్పాండ్లను పరిశీలించారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్లో ఏ విధంగా నీరు నిల్వ చేస్తున్నారు, నిల్వ చేసిన నీటిని ఏ విధంగా వాడుతున్నారు, ఎంత నీటితో విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు, ఆంధ్ర, తెలంగాణకు ఎంత నీరు వాడుతున్నారనే అంశాలను కేఆర్యంబీ బృంద సభ్యులు కేత్ర స్థాయిలో పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు సంబంధించిన వివరాలతో నివేదికను తయారు చేసి ఉన్నతా ధికారులకు అందజేయనున్నట్లు బృంద సభ్యులు తెలిపారు.
ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ మాట్లాడుతూ
కేఆర్యంబీ బృంద సభ్యులు నాగార్జునసాగర్ ప్రాజెక్టన్ను సందర్శించి ఇరు తెలుగు రాష్ర్టాల మధ్య నెలకొన్న జల వివి దాల సమస్యలను పరిష్కరించడానికి గాను, ప్రాజెక్ట్ను కేఆర్యంబీ పరిధిలోకి తీసుకునే అంశాలపై కేత్ర స్థాయిలో బృందం పర్యటించిందన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్, కెనాల్స్లు, టెయిల్పాండ్ను సందర్శించారని, గురువారం పుట్టంగడిని సందర్శిస్తారన్నారు. అం తకు మందు విజయవిహార్ కు చేరుకున్న కేఆర్యంబీ బృంద సభ్యులను ఎన్నెస్పీ ఎస్ఈ ధర్మానాయక్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. వీరితో ఈఈ సత్యనారాయణ, డీఈలు పరమేశ్, శ్రీనివాస్రావు, సుదర్శన్రావు, ఏఈలు రవి, సత్యనారాయణ, జైల్సింగ్, కృష్ణయ్య ఉన్నారు.