నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కృష్ణ వ్రింద విహారి’. అనీష్ ఆర్ కృష్ణ దర్శకుడు. ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా మూల్పూరి నిర్మిస్తున్నారు. శనివారం నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ఇందులో నుదుటిన నిలువు తిలకం పెట్టుకొని, ముంజేతికి కంకణం ధరించి సంప్రదాయబద్దంగా కనిపిస్తున్నారు నాగశౌర్య. ‘ఇప్పటివరకు నాగశౌర్య చేసిన పాత్రలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. సకుటుంబ కథా చిత్రంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. షిర్లే సెటియా కథానాయికగా నటిస్తున్నది’ అని చిత్రబృందం తెలిపింది. రాధిక, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: మహతి స్వరసాగర్, సమర్పణ: శంకర్ప్రసాద్ మూల్పూరి, దర్శకుడు: అనీష్ ఆర్ కృష్ణ.