అక్కినేని మూడో తరం వారసుడు నాగ చైతన్య తన కెరీర్ని స్లో అండ్ స్టడీగా ముందుకు తీసుకెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్లో సినిమాలు చేసుకుంటూ వెళ్లిన నాగ చైతన్య ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. చైతూ తెలుగులో జోష్ సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యారు. రీసెంట్గా లవ్ స్టోరీ చిత్ర షూటింగ్ పూర్తి చేశారు.ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది.
రీసెంట్గా అక్కినేని నాగ చైతన్య హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ రీమేక్ చిత్రం లాల్ సింగ్ చద్దాలో నటించాడు. ఇందులో చైతూ ఒక ఆర్మీ ఆఫీసర్ పాత్రలో ఆమీర్ ఖాన్ తో వెండి తెరని పంచుకున్నాడు. “లాల్ సింగ్ చద్దా” సినిమాలో ఆర్మీ లుక్ కోసం కొంత కాలం ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నాడు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆమీర్ ఖాన్, రాధిక చౌదరి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా చైతూ పార్ట్ పూర్తి కాగా, అమీర్ ఖాన్ ఇతర చిత్ర బృందం చైతూతో కేక్ కట్ చేయించి గ్రాండ్గా సెండాఫ్ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక చైతూ త్వరలో మనం, 24, నాని గ్యాంగ్ లీడర్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ “థ్యాంక్ యూ” సినిమా షూటింగ్ లో పాల్గొననున్నాడు.