ఉధంపూర్: జమ్ముకశ్మీర్లోని ఉధంపూర్లో (Udhampur) అనుమానాస్పద పేలుళ్లు సంభవించాయి. బుధవారం రాత్రి ఆగిఉన్న బస్సులో పేలుగు సంభవించిన గంటల వ్యవధిలోనే రెండో పేలుడు చోటుచేసుకున్నది. గురువారం ఉదయం ఉధంపూర్లోని పాతబస్టాండ్లో నిలిపిఉన్న బస్సులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవ్వరికీ ప్రమాదం జరుగలేదని అధికారులు వెల్లడించారు.
కాగా, బుధవారం రాత్రి 10.45 గంటల సమయంలో ఉధంపూర్కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న దొమాలి చౌక్ వద్ద ఓ బస్సులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఈ రెండు పేలుడు ఘటనలపై పోలీసులు, భద్రతా బలగాలు దృష్టిసారించాయి. గంటల వ్యవధిలోనే ఇవి చోటుచేసుకోవడంతో ఏమైనా ఉగ్రవాద కారణాలున్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
#WATCH | J&K: A blast occurred in an empty passenger bus parked near a petrol pump at Domail Chowk in Udhampur at around 10:30 pm. Two persons were injured and have been shifted to the District hospital. Police & other agencies reached the spot.
(CCTV Visuals verified by Police) pic.twitter.com/3ESVXPdufP
— ANI (@ANI) September 28, 2022