హుజూరాబాద్: తమను గుర్తించి ఆత్మగౌరవ భవనం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామని ముస్లిం నూర్భాషా, దూదేకుల వృత్తి సంక్షేమ సంఘం పేర్కొంది. మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్ను ఆదివారం ఆ సంఘం అధ్యక్షుడు షేక్ సిద్దాసాహెబ్ ఆధ్వర్యంలో కలిశారు. హుజూరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. గెల్లు శ్రీనివాస్యాదవ్ గెలుపు కోసం తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం జాతీయ ఇన్చార్జి, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు షేక్ జానీభాయ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ సుబాన్ అలీ, తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ రషీద్, రాష్ట్ర పొలిటికల్ కో-ఆర్ఢినేటర్ మహమ్మద్ జహంగీర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ ఖాజామియా, రాష్ట్ర దీన్ కమిటీ సెక్రటరీ షే నాగులుమీరా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.