హైదరాబాద్ : నగరంలోని ట్యాంక్బండ్పై ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐకి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం ముషీరాబాద్లోని ఓ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన కారు యజమానిని గాంధీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారు యజమానిని ఆసిఫ్ నగర్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.