హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తన స్వార్థం కోసమే ఉప ఎన్నిక తెచ్చారని మండిపడ్డారు. బుధవారం మునుగోడు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకొంటుంటే రాజగోపాల్రెడ్డి మాత్రం కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం పదవిని బీజేపీకి తాకట్టుపెట్టారని ఫైర్ అయ్యారు. తన స్వార్థం కోసం నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన రాజగోపాల్కు గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు.
గెలిచిన తరువాత ఏనాడూ నియోజకవర్గ ముఖం చూడని రాజగోపాల్రెడ్డి.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ గ్రామాల్లో తిరుగుతున్నారని ప్రజలే ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగురవేస్తామని ప్రజలు నిర్ణయించుకొన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరిని నిలిపినా భారీ మెజారిటీతో గెలిపించేందుకు అహర్నిశలు కృషిచేస్తామన్నారు. సైనికుల్లాంటి తమ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని, మునుగోడు ప్రజల పక్షాన నిలబడి తమ తడాఖా చూపిస్తామంటున్నారని పేర్కొన్నారు.
ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి, పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామన్నారు. నియోజకవర్గంలోని స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులంతా ఒక్క తాటిపై ఉన్నామని పేర్కొన్నారు. టీఆర్ఎస్లో అసంతృప్తులకు ఆస్కారమే లేదన్నారు. నియోజవర్గ అభివృద్ధి కోసం తప్పకుండా అందరి అభిప్రాయాలు విడివిడిగా తీసుకుంటామని, కలిసి చర్చించినంత మాత్రాన మూ ర్ఖంగా వేరే విషయాలను ఆపాదిస్తే తాము చేయగలిగింది ఏమీలేదన్నారు. గతంలో హుజూర్నగర్, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలప్పుడూ తాము సమావేశాలు నిర్వహించుకొన్నామని గుర్తుచేశారు.
అందరం ఒక్కటిగానే ఉన్నాం..
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా తామంతా కలిసికట్టుగా ఎదుర్కొని గులాబీ జెండా ఎగురవేస్తామని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపునకు సంబంధించిన వ్యూహాలపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లా మంత్రి, పార్టీ అధ్యక్షుడు, జిల్లా ఇన్చార్జిలతో బుధవారం హైదరాబాద్లో సమావేశమై చర్చించామని, సీఎం ఆదేశాలను శిరసావహిస్తూ పార్టీ గెలుపే తమ గెలుపుగా భావిస్తామని, మంత్రి జగదీశ్రెడ్డి నాయకత్వంలో కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం..
ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థులు టికెట్ ఆశిస్తూ గ్రూపులుగా విడిపోయి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు దుష్ప్రచారం చేస్తున్నారని స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. సమావేశంలో జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రవీందర్నాయక్, జిల్లా పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తకెళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మునుగోడు జడ్పీటీసీ రవి, నాంపల్లి జడ్పీటీసీ వెంకటేశ్వరరెడ్డి, నారాయణపూర్ ఎంపీపీ ఉమా రామచంద్రరెడ్డి, చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, చౌటుప్పల్ ఎంపీపీ వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీలు బుచ్చిరెడ్డి పెద్దింటి, శివజాజిల అంజయ్య శేఖర్, సిం గిల్ విండో చైర్మన్ దామోదర్రెడ్డి, జంగారెడ్డి మా రెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, చండూరు మున్సిపల్ చైర్మన్ వెంకన్న, మారెట్ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, మునుగోడు ఎంపీపీ స్వామి, నాంపల్లి ఎంపీపీ శ్వేతా రవీందర్రెడ్డి, మర్రిగూడ జడ్పీటీసీ సురేందర్రెడ్డి, మర్రిగూడ ఎంపీపీ మో హన్రెడ్డి, మాల్మారెట్ కమిటీ చైర్మన్ జగన్, వైస్ ఎంపీపీ స్వామి తదితరులు పాల్గొన్నారు.