సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 13 : ‘రూ.22 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం 13 ఏండ్ల నమ్మకాన్ని అమ్ముకున్న ద్రోహివి. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీకి అమ్ముడుపోయిన నీచుడివి నువ్వు. ఈడీ, అక్రమ కేసులతో సోనియాగాంధీని వేధిస్తుంటే.. అమిత్షాతో బేరసారాలు ఆడిన దుర్మార్గుడు రాజగోపాల్రెడ్డి.
మునుగోడు గడ్డ ఎప్పటికీ నిన్ను క్షమించదు’ అని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డిపై ప్రచురించిన పోస్టర్లు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో వెలిశాయి. గుర్తుతెలియని వ్యక్తులు అతికించిన ఈ పోస్టర్లపై మునుగోడు నియోజకవర్గ ప్రజలు చర్చించుకొంటున్నారు.