కైరో: ప్రాచీన కాలంలో ఈజిప్టును ఫారో చక్రవర్తుల పరిపాలించిన విషయం తెలిసిందే. అయితే ఆ చక్రవర్తులకు చెందిన మమ్మీలను మరో చోటుకు మార్చనున్నారు. దీని కోసం శనివారం కైరోలో గోల్డెన్ పరేడ్ నిర్వహించనున్నారు. మొత్తం 22 ప్రాచీన రాజులు, రాణుల మమ్మీలను కొత్త మ్యూజియంలోకి తీసుకువెళ్లనున్నారు. దీంట్లో 18 మంది చక్రవర్తులు, నలుగురు రాణులు ఉన్నారు. ప్రాచీన ఈజిప్టియన్ శైలిలో అలంకరించిన బోట్లపై మమ్మీలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సెంట్రల్ కైరోలో ఉన్న మ్యూజియం నుంచి కొత్తగా నిర్మించిన జాతీయ మ్యూజియంకు తరలించనున్నారు. కొత్త మ్యూజియంలో ఏర్పాటు చేసిన కొత్త బాక్సుల్లో మమ్మీలను భద్రపరచనున్నారు. పాత మ్యూజియం కన్నా కొత్త దాంట్లో ఉష్ణోగ్రతలు మెయిన్టేన్ చేయవద్దు అని కైరో ప్రతినిధులు తెలిపారు. 40 నిమిషాల పాటు కైరో వీధుల్లో మమ్మీల పరేడ్ ఉంటుంది. క్రీస్తు పూర్వం 1600 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన తావో-2 మమ్మీ పరేడ్లో మొదటి వరసలో ఉంటుంది. చివరగా ఆ ఊరేగింపులో రామ్సేస్-లెవన్ మమ్మీ ఉంటుందని అధికారులు చెప్పారు. పరేడ్ కోసం భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.