హైదరాబాద్: తిరుమల తిరుపతి దేవస్థానికి ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించారు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే భక్తుడు.. టీటీడీకీ భారీ ఆస్పత్రిని కట్టిచ్చేందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో ఆ భక్తుడు ఒప్పందం కుదుర్చుకున్నారు. 300 పడకలతో ఆ ఆస్పత్రిని నిర్మించనున్నారు. హాస్పిటల్ నిర్మాణం కోసం సుమారు 300 కోట్లు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. టీటీడీ, ముంబై భక్తుడి మధ్య కుదిరిన ఒప్పందం గురించి ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది.