ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. దేశ ప్రజలంతా కరోనా వ్యాక్సిన్ వేసుకొని.. కరోనా బారి నుంచి తప్పించుకుంటున్నారు. ఈనేపథ్యంలో ముంబైకి చెందిన సురానా సేతియా అనే హాస్పిటల్ సిబ్బంది వారం రోజుల్లో 30,467 మంది కరోనా వ్యాక్సిన్ వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సెట్ చేశారు.
ఒకే ఆసుపత్రిలో వారం రోజుల వ్యవధిలో అన్ని వేల వ్యాక్సిన్లు వేయడం అనేది ఇదే మొదటిసారి. ఆగస్టు 7 నుంచి 13 వరకు ఈ డ్రైవ్ను నిర్వహించారు. ధారావి, వర్లీ ప్రాంతాల్లో ఉండే స్లమ్స్లో నివసించే ప్రజలు ఈ డ్రైవ్లో వ్యాక్సిన్ వేయించుకున్నట్టు ఆసుపత్రి వెల్లడించింది.
ఈ డ్రైవ్లో భాగంగా.. ఆసుపత్రికి చెందిన 60 మంది సిబ్బంది వారం పాటు 24 గంటలు పనిచేసి.. 30 వేల మందికి వ్యాక్సిన్ వేశారు. ఆగస్టు 7 న ఉదయం 9 గంటలకు ఈ డ్రైవ్ ప్రారంభం కాగా.. ఆగస్టు 13న సాయంత్రం 4 గంటలకు ముగిసింది. సగటున రోజుకు 3 వేల మందికి ఈ డ్రైవ్లో వ్యాక్సిన్ వేశారు. ఈ డ్రైవ్ను మరో వారం పొడిగించి.. మరో 20 వేల మందికి వ్యాక్సిన్ వేశామని ఆసుపత్రి సీఈవో ప్రిన్స్ సురానా వెల్లడించారు.