ముంబై : మహారాష్ట్రకు చెందిన బిల్డర్, బాలీవుడ్ ఫిల్మ్ ఫైనాన్షియర్ యూసుఫ్ లక్డావాలా గురువారం మృతి చెందారు. భూ ఆక్రమణ కేసులో ఈడీ ఆయనను అరెస్టు చేయగా.. ప్రస్తుతం ముంబై ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. మృతదేహాన్ని అధికారులు జేజే ఆసుప్రతికి తరలించారు. ఈ మేరకు అధికారులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్టు నమోదు చేశారు. అయితే, లక్డావాలా మరణానికి కారణాలు మాత్రం తెలియరాలేదు.
భూ కబ్జా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన తర్వాత ఆర్థర్ జైలులో ఉన్నారు. పుణెలోని ఖండాలా ప్రాంతంలో ఉన్న రూ.50 కోట్ల విలువైన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించినందుకు యూసఫ్ లక్డావాలాతో పాటు పలువురిపై ముంబై పోలీసులు (ఆర్థిక నేరాల విభాగం) ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ మేరకు ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది.