ముంబై : నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు ఆదివారం రాత్రి ముంబై ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.7కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశీయుడు శరీరం లోపల డ్రగ్స్ను దాచి తరలిస్తుండగా పట్టుకున్నారు. విదేశీయుడికి ప్రత్యేక ఔషధం ఇచ్చి శరీరంలో నుంచి డ్రగ్స్ను వైద్యులు బయటకు తీశారు. అంతర్జాతీయ ముఠాతో సంబంధం ఉన్న ఓ వ్యక్తి మాదకద్రవ్యాలతో ముంబై నగరంలో దిగబోతున్నట్లు సమాచారం వచ్చిందని ఎన్సీబీ అధికార వర్గాలు పేర్కొన్నాయి. పట్టుకున్న డ్రగ్స్ విలువ రూ.7కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇంతకు ముందు ఆగస్ట్ 6న అధికారులు వంద గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకొని.. ఓ విదేశీయుడిని అరెస్టు చేసింది.