ఢిల్లీ: దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ 2020-21 సీజన్ విజేతగా ముంబై జట్టు నిలిచింది. దీంతో ముంబై టీమ్ నాలుగోసారి హజారే ట్రోఫీని గెలుచుకున్నట్లయింది. యువ ఓపెనర్ పృథ్వీ షా నాయకత్వంలోని ముంబై జట్టు ఉత్తర్ప్రదేశ్తో జరిగిన ఫైనల్ పోరులో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పృథ్వీ షా(73: 39 బంతుల్లో 10ఫోర్లు, 4సిక్సర్లు) మెరుపు ఆరంభానికి తోడు ఆదిత్య తారే(118 నాటౌట్: 107 బంతుల్లో 18ఫోర్లు) శతకంతో రాణించడంతో 313 పరుగుల లక్ష్యాన్ని ముంబై 41.3 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. శివమ్ దూబే(42), శామ్స్ ములానీ(36) ఆకట్టుకున్నారు. ముంబై బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో యూపీ బౌలర్లు విఫలమయ్యారు.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన యూపీ 50 ఓవర్లలో 4 వికెట్లకు 312 పరుగులు చేసింది. మాదవ్ కౌశిక్(158 నాటౌట్: 156 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించాడు. సమర్థ్ సింగ్(55), అక్షదీప్ నాథ్(55) అర్ధసెంచరీలతో రాణించారు. సీజన్లో పృథ్వీ షా బ్యాటింగ్ హైలెట్గా నిలిచింది. టోర్నీలో ఇప్పటి వరకు పృథ్వీ ఏకంగా నాలుగు శతకాలు బాదడం విశేషం.