జేసీ స్వర్ణలత
భూపాలపల్లి రూరల్, ఏప్రిల్ 1 : అధిక చార్జీలు వసూలు చేసే మీ సేవ కేంద్రాల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత హెచ్చరించా రు. గురువారం కలెక్టరేట్లో మీ సేవ కేం ద్రాల ద్వారా ప్రజలకు అందిస్తు న్న ఆన్లైన్ సేవలపై నిర్వాహకులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని నిర్వాహకులు ప్రజల నుంచి అధిక రుసుమువసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలని అన్నారు. మీ సేవ కేంద్రాలు పని దినాల్లో కచ్చితంగా తెరిచి ఉంచాలన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు మీసేవ కేంద్రాలను అర్హత ఉన్న వారికి కేటాయించాలని అన్నారు. మీసేవ కేంద్రాల నిర్వహణపై నివేదిక ఇవ్వాలని మీసేవ డిస్ట్రిక్ట్ మేనేజర్ను జేసీ ఆదేశించారు. సమావేశంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ గౌస్, ఈడీఎం శ్రీకాంత్ పాల్గొన్నారు.
నిల్వ ఉన్న బియ్యాన్ని వేలం వేయండి
సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజనం బియ్యం వేలం వేయాలని జేసీ స్వర్ణలత అన్నారు. గురువారం కలెక్టరేట్లో డీఈవో, సంబంధిత శాఖల అధికారులతో జేసీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. లాక్డౌన్ కారణంగా నిల్వ ఉన్న బియ్యం పాడయ్యే ప్రమాదం ఉందని, సేకరించి వేలం వేయాలని పౌరసరఫరాల శాఖ ఇన్చార్జి అసిస్టెంట్ సివిల్ సప్లయ్ అధికారి మహ్మద్ ముస్తఫాను ఆదేశించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీల్లో గత సంవత్సరం నుంచి నిల్వ ఉన్న బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అందజేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి శైలజ, ఎస్సీ అభివృద్ధి అధికారి సునీత, డీఈవో మహ్మద్ అబ్దుల్ హై, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ రాఘవేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ఆదివారాలు, పండుగ రోజుల్లోనూ కొవిడ్ వ్యాక్సినేషన్
పోలింగ్ బూత్ నుంచే గవర్నర్కు ఫోన్ చేసిన మమతా బెనర్జీ