నిర్మల్: చదువుల తల్లి బాసర (Basara) సరస్వతీ దేవి ఆలయంలో మూలా నక్షత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు కాళరాత్రి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేదపండితులు అష్టోత్తరనామార్చన నిర్వహించారు. మూల నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచే దర్శనం చేసుకుంటున్నారు.
దీంతో క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసి పోతున్నాయి. సరస్వతి సన్నిధఙలో అక్షరాభ్యాస కార్యక్రమం ప్రారంభమవడంతో మండపాల్లో రద్దీ నెలకొన్నది. కాగా, ఆనవాయితీ ప్రకారం మూలనక్షత్రం రోజున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.