ముంబై : నిఘా వర్గాల హెచ్చరికలతో పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి భద్రత పెంచారు. ఆర్ఐఎల్ అధినేత అంబానీకి హోంమంత్రిత్వ శాఖ జడ్ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ముఖేష్ అంబానీకి అంతకుముందు జడ్ కేటగిరీ భద్రత ఉండగా గత ఏడాది ఆయన నివాసం యాంటిలియ వద్ద బాంబు కలకలం నేపధ్యంలో ఆయనకు భద్రత పెంచాలని హోంమంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
జడ్ప్లస్ కేటగిరీ దేశంలో రెండో అతిపెద్ద భద్రత కవరేజ్. జడ్ప్లస్ భద్రతలో భాగంగా పది మందికి పైగా ఎన్ఎస్జీ కమాండోలు, పోలీస్ అధికారులు సహా 55 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. ప్రతి కమాండో మార్షల్ ఆర్ట్స్తో పాటు కఠోర సైనిక శిక్షణ పొందినవారై ఉంటారు.