న్యూఢిల్లీ: ఆసియాలో కెల్లా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ సంపద కేవలం ఒక్క వారంలోనే 6.2 బిలియన్ డాలర్లు పెరిగింది. గత వారం రిలయన్స్ షేర్లు 10 శాతానికి పైగా దూసుకెళ్లడంతో ఆయన సంపద వ్రుద్ధి చెందింది.
మే 23వ తేదీన ముకేశ్ అంబానీ నికర సంపద రూ.5.62 లక్షల కోట్లు (77 బిలియన్ డాలర్లు) ఉండగా, ఈ నెల ఒకటో తేదీన (మంగళవారం) ఆయన ఆస్తి విలువ రూ.6.07 లక్షల కోట్ల (83.2 బిలియన్ల డాలర్లు)కు చేరుకున్నది.
రిలయన్స్ ఇండస్ట్రీస్లో ముకేశ్ అంబానీ వాటా 49.14 శాతం. మంగళవారం ట్రేడింగ్లో 0.5 శాతం పెరిగి రూ.2,169 చొప్పున రిలయన్స్ షేర్ ర్యాలీ అయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (నిఫ్టీ) నూతన రికార్డులు నెలకొల్పడానికి రిలయన్స్ షేర్ల ర్యాలీ కారణంగా నిలిచింది.
రిలయన్స్ షేర్ గతేడాది మూడు పెరిగింది. గతేడాది మార్చి 23న కనిష్ఠ స్థాయి రూ.875 వద్ద ముగిసిన రిలయన్స్ షేర్ సెప్టెంబర్ 16 నాటికి రూ.2,324కు చేరుకున్నది.
నిరంతరం జియో ప్లాట్ఫామ్, రిటైల్ బిజినెస్ల్లోకి నిధుల సేకరణ ముమ్మరం చేసింది రిలయన్స్. స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ధోరణి ఇలాగే కొనసాగితే త్వరలో అంబానీ వ్యక్తిగత సంపదలో మరో 10 బిలియన్ల డాలర్లు జత కలుస్తాయని అంచనా వేస్తున్నారు.
స్వల్ప కాల వ్యవధిలో రిలయన్స్ షేర్లు మరో 15 శాతం పెరుగుతాయని అంచనా. అదే జరిగితే ప్రపంచ కుబేరుల జాబితాలో 12వ ర్యాంక్ నుంచి 8వ స్థానానికి ఎదుగుతారని బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది.
దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకాలు ఇవ్వండి.. కోవిడ్ నుంచి కోలుకుంటూ కేంద్రానికి థరూర్ విజ్ఞప్తి
ఆన్లైన్ క్లాస్ వినాలంటే ఆరు కిలోమీటర్లు నడవాల్సిందే
22 కోట్ల కోవాగ్జిన్ టీకాలను ఉత్పత్తి చేయనున్న ముంబై కంపెనీ
మరో వైరస్ కలకలం.. దేశంలో తొలిసారిగా స్కిన్ బ్లాక్ ఫంగస్ కేసు గర్తింపు
అంబులెన్సుల దందా.. 40 కి.మీటర్లకు రూ.17 వేలు
న్యూయార్క్ కన్నా ముంబైలో రెట్టింపు!
రాందేవ్ బాబా దేశ వ్యతిరేకి : ఐఎంఏ
ఎస్పీఎస్ఎన్ లో 11 జూన్ నుంచి అతిపెద్ద అంతర్జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్స్ లైవ్..
నో డౌట్: ఇప్పట్లో లీటర్ పెట్రోల్ రూ.100 తగ్గదు..!!
విదేశీ వ్యాక్సిన్లకు ఆ రక్షణ కల్పించడానికి సిద్ధం!
పాక్తో కలిసి వాస్తవాధీన రేఖ వద్ద మిస్సైళ్లను పరీక్షిస్తున్న చైనా
పాకిస్థాన్లో మ్యూజియాలుగా రాజ్కపూర్, దిలీప్కుమార్ ఇళ్లు
అతిపెద్ద మాంస విక్రయ సంస్థపై సైబర్ దాడి..
ఆ ఒక్క కరోనా వేరియంటే ఆందోళన కలిగిస్తోంది: డబ్ల్యూహెచ్వో