మంచిర్యాల స్టాఫ్ ఫొటోగ్రాఫర్ : మంచిర్యాల పట్టణంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద, సున్నంబట్టి వాడలో మట్టి వినాయకులు నవరాత్రి పూజలకు సిద్ధమవుతున్నాయి. స్థానిక వ్యాపారులు చెరువుల నుంచి తీసుకొచ్చిన మట్టితో ఫీటు నుంచి ఐదు ఫీట్ల ఎత్తు వరకు తయారు చేస్తున్నారు.
రూ.2500 మొదలుకొని.. రూ. 12,500 వరకు ప్రతిమలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే భక్తులు ముందస్తుగా బుకింగ్ చేసుకుంటున్నారని వారు పేర్కొంటున్నారు.