న్యూఢిల్లీ: క్షమించలేని రీతిలో దేశ భద్రత నిర్వీర్యమైందని, ఎందుకంటే చైనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం వద్ద ఎటువంటి వ్యూహం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. చైనాతో ఉన్న సరిహద్దు వివాదంపై మాట్లాడుతూ.. విదేశాంగ శాఖ కార్యాలయానికి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కు మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు ఆయన అన్నారు. భారత భూభాగంలోకి వచ్చి చైనా ఓ గ్రామాన్ని నిర్మించినట్లు వస్తున్న వార్తలు నిజం కాదన్నారు. ఆ గ్రామాలు చైనీయుల భూభాగంలోనే ఉన్నట్లు ఆయన చెప్పారు. మోదీజీ 56 ఇంచుల ఛాతి గురించి కామెంట్ చేస్తూ.. దేశ భద్రత విషయంలో కేంద్రానికి ప్రణాళికలేదని, 56 ఇంచుల మోదీ భయంతో ఉన్నట్లు రాహుల్ ఆరోపించారు. సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి రక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సైనికుల వెంట తాము ఉంటామన్నారు.
జన జాగరణ్ అభియాన్లో భాగంగా వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. హిందూమతానికి, హిందుత్వకు తేడా ఏంటని అడిగారు. ఆ రెండూ ఒకటేనా, ఒకవేళ అవి రెండూ ఒక్కటే అయితే, మరి అప్పుడు ఆ రెండింటికి పేర్లు ఒక్కటిగా ఎందుకు లేవని రాహుల్ ప్రశ్నించారు. హిందూ మతం, హిందుత్వ రెండూ వేరు అని, హిందూయిజం అంటే సిక్సులను, ముస్లింలను కొట్టడమా, హిందుత్వ అంటే అలా చేయడమే అని రాహుల్ విమర్శలు చేశారు.