న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు చెందిన వ్యాపమ్ స్కామ్లో 5 మంది నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష విధించారు. సీబీఐ కోర్టు ఈ శిక్షను ఖరారు చేసింది. దోషులకు కోర్టు 10 వేల జరిమానా కూడా విధించింది. స్పెషల్ సీబీఐ జడ్జి నితి రాజ్ సింగ్ సిసోడియా కేసులో తీర్పునిచ్చారు. 2013లో వ్యాపమ్ స్కామ్ జరిగినట్లు సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మనుజి ఉపాధ్యాయ తెలిపారు. శిక్ష పడినవారిలో రవికుమార్, కమల్ కిశోర్, అమర్ సింగ్, నాగేంద్ర సింగ్, సురేశ్ సింగ్ ఉన్నారు. 32 మంది సాక్షుల్ని విచారించారు.