కొండపాక, మార్చి 6: సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా 200 మొక్కలను స్వయంగా నాటిన సిద్దిపేట జిల్లా కొండపాక సర్పంచ్ చిట్టి మాధురిని ఎంపీ సంతోష్కుమార్ శనివారం ట్విట్టర్లో అభినందించా రు. గ్రామంలోని వైకుంఠధామంలో సర్పంచ్ స్వయంగా మొక్కలను నాటి, సంరక్షణ చర్యలు చేపట్టారు. గ్రీన్చాలెంజ్పై పలువురికి స్ఫూర్తినిచ్చేలా తన ట్విట్టర్ ఖాతాలో మొక్కల ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ పోస్టును చూసిన ఎంపీ సంతోష్కుమార్.. సర్పంచ్ మాధురిని ప్రశంసించారు.