సిరికొండ, అక్టోబర్ 7 : దేశానికి కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) రైతులు, పింఛన్దారులు టీఆర్ఎస్(బీఆర్ఎస్)కు విరాళంగా రూ.1.16 లక్షలను అందించటంపై ఎంపీ సంతోష్కుమార్ హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సామర్థ్యంపై నమ్మకంతో దాచుకొన్న డబ్బును టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు విరాళంగా ఇవ్వడాన్ని ప్రశంసించారు. ఈ మేరకు ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన ఫొటోను ట్విట్టర్లో పోస్టుచేశారు.