ఖమ్మం సిటీ, మే 31 : ‘రామయ్య గారు ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉన్నది? మీ ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ గారు వాకబు చేశారు. మీరు త్వరగా కోలుకోవాలి’ అంటూ వనజీవి రామయ్యను రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ మంగళవారం వీడియోకాల్ ద్వారా పరామర్శించారు.
వనజీవి రామయ్య ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఖమ్మం ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఎంపీ సంతోష్కుమార్.. డాక్టర్ రాజశేఖర్గౌడ్ ఫోన్కు వీడియోకాల్ చేశారు. ఈ సందర్భంగా వనజీవి రామయ్యతో సంభాషించారు. ఆరోగ్యం ఎలా ఉన్నది? వైద్యులు ఎలాంటి చికిత్సలు అందిస్తున్నారు? అంటూ ఆరా తీశారు. సీఎం కేసీఆర్ కూడా వాకబు చేశారని వనజీవి రామయ్యకు ఎంపీ సంతోష్కుమార్ గుర్తుచేశారు. త్వరలో వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని చెప్పారు.