గత 40,000 సంవత్సరాలుగా భారత్లోని ప్రజలందరిదీ ఒకే డీఎన్ఏ అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ”ప్రతి వ్యక్తి డీఎన్ఏ భిన్నమైందన్నది హిందువుల భావన. కానీ అందరి డీఎన్ఏ ఒక్కటేనని హిందూవాదుల భావన” అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ”గత 40,000 సంవత్సరాల నుంచి భారతీయులందరిదీ ఒక్కటే డీఎన్ఏ. మనందరి పూర్వీకులూ ఒక్కరే. వారి వల్లే మన దేశం ఇంతలా వెలుగొందుతోంది. మన సంస్కృతి కొనసాగుతోంది” అని మోహన్ భాగవత్ పేర్కొన్నారు.