హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుమ్మక్కు అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే.. బీజేపీలో చేరిన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నాడు. ఈ ఉప ఎన్నికలో రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తులు చేస్తున్నారు. కాంగ్రెస్ కేడర్కు కూడా బీజేపీకి ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీకైంది.
మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ చేశారు. ఓ కాంగ్రెస్ లీడర్తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దెబ్బ తో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా.. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చేస్తా, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తానని చెప్పారు. పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి.. ఏదైనా ఉంటే నేనే చూసుకుంటా.. చచ్చిన బతికిన రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి ఓటు వేయాలని వెంకట్ రెడ్డి కోరారు.