న్యూఢిల్లీ: లోక్సభలో ప్రవేశపెట్టిన ఓబీసీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు తెలిపింది. ఆ బిల్లుపై టీఆర్ఎస్ ఎంపీ భీమ్రావ్ బస్వంతరావ్ పాటిల్ మాట్లాడారు. తెలంగాణలో అనేక జాతులు ఓబీసీలో కలవలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 40 కులాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ అనేక కులాలు ఓబీసీ జాబితాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయన్నారు. వీరశైవ లింగాయత్లు ఓబీసీలో చేరాలని ఎప్పటి నుంచి డిమాండ్ చేస్తున్నట్లు బీబీ పాటిల్ తెలిపారు. పదేళ్ల నుంచి వీరశైవ లింగాయత్ల అభ్యర్థన కేంద్రం వద్దే ఉందన్నారు. ఓబీసీ జనగణన చేపట్టాలన్నారు. ఓబీసీల మేలు కోసం ప్రత్యేకంగా మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని బీబీ పాటిల్ కోరారు. ఓబీసీల కోటా పెంచాలన్న బిల్లును స్వాగతిస్తున్నాం.. సమర్థిస్తున్నామని ఆయన తెలిపారు.