కవాడిగూడ, మే 14: లింగాయత్ సమాజ్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. విశ్వగురు మహాత్మా బసవేశ్వర 888 జయంతి సందర్భంగా ట్యాంక్బండ్లోని బసవేశ్వర విగ్రహానికి శుక్రవారం పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ట్యాంక్బండ్పై బసవేశ్వరుని విగ్రహం ఏర్పాటు చేయించడం హర్షణీయమని ఆయన అన్నారు. అదే విధంగా బసవేశ్వర భవనానికి ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసి భవనాన్ని నిర్మించాలని ఆయన కోరారు. బసవేశ్వరుడు 12వ శతాబ్దపు గొప్ప సామాజిక సంఘ సంస్కర్త, మానవతావాది అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బడికన్నే హనుమంతు, రాష్ట్ర యువజన సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్, సతీశ్, కోట గుండప్ప, వంగి సుభాష్ పాల్గొన్నారు.