హైదరాబాద్: మసీదుల్లో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని ముస్లింలకు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ (Asaduddin owaisi), పలువురు మతపెద్దలు పిలుపునిచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా కొందరు ముస్లిం నాయకులు నేడు నిరసన చేపడుతామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా ఉండాలంటే ప్రార్థనల అనంతరం అందరూ ప్రశాంతంగా తమ ఇండ్లకు వెళ్లాలని ఒవైసీతోపాటు జమాతే ఉలేమా నాయకుడు మౌలానా హుసాముద్దిన్ సాని జాఫర్ పాషా పిలపునిచ్చారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం నిర్వహించతలపెట్టిన నిరసన ప్రదర్శనలను ఉపసంహరించుకొంటున్నట్టు ముస్లిం మతపెద్ద ముస్తాక్ మాలిక్ ఇప్పటికే ప్రకటించారు.