రవీంద్రభారతి,సెప్టెంబర్14: సినిమాలు మానసిక వికాసానికి దోహదపడాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు.వంశీ ఆర్ట్స్ థియేటర్, ఇంటర్నేషనల్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా ప్రముఖ సినీనటి డాక్టర్ జమునరమణారావుకు ఆత్మీయ సత్కారంతో పాటు స్వర్ణకంకణ ప్రదానో త్సవం బుధవారం రవీంద్రభారతిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు జమునకు అవార్డును ప్రదానం చేశారు. అనంతరం వంశీ స్వర్ణోత్సవ ప్రత్యేక ప్రచురణలను ఆవిష్కరించారు. పలు రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖలు రేలంగి నర్సింహారావు, మండలి బుద్ధ ప్రసాద్, తెలుగు యూనివర్సిటీ వైస్చాన్సలర్ తంగెడి కిషన్రావు, సినీనటి రోజారమణి, లక్ష్మీప్రసాద్, డాక్టర్ జి.శ్రీకాంత్, ఘంటసాల కృష్ణకుమారి, దయా తిరుమలరావులకు అవార్డులను ప్రదానం చేశారు.ఈ సభకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డాక్టర్ కె.వి రమణాచారి అధ్యక్షత వహించగా.. మాజీ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి పాల్గొన్నారు.