అమరావతి : విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్నా కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవడం విచారకరమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. సంవత్సరం పాటు అలుపెరగకుండా ఉద్యోగులు, కార్మికులు నిరసనలు తెలియజేస్తున్నందుకు ఉద్యమాభివందనాలు తెలిపారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తుందని, పార్లమెంట్ వరకు నిరసన గళం వినిపిస్తూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. విశాఖ ఉక్కు గురించి ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీలు మాట్లాడడం లేదని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా విశాఖ ఉక్కును కాపాడుకుంటామని వెల్లడించారు. ఇప్పటికైనా విశాఖ ఉక్కును ప్రైవేట్పరం చేయడాన్ని కేంద్రం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.