సిరిసిల్ల: జిల్లాలోని తంగల్లపల్లి మండలంలో చిరుతపులి కలకలం సృష్టిస్తున్నది. మండలంలోని గండిలచ్చపేటలో రైతు నర్సయ్యకు చెందిన బర్రెపై దాడి చేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు భయాందోళన చెందున్నారు. అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఇటీవల వేణుగోపాల్పూర్లో రెండు బర్రెలపై దాడిచేసి చంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. కాగా, ప్రజలు రాత్రి సమయంలో ఒంటరిగా తిరుగొద్దని అధికారులు సూచించారు.