న్యూఢిల్లీ : మొటోరోలా భారత్లో జీ సిరీస్ కింద బ్రాండ్ న్యూ స్మార్ట్ఫోన్ మోటో జీ72ను లాంఛ్ చేస్తోంది. అక్టోబర్ 3న లేటెస్ట్ స్మార్ట్ఫోన్ను కస్టమర్ల ముందుకు తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేపట్టింది. పండగ సీజన్లో పలు స్మార్ట్ఫోన్లు అక్టోబర్లో భారత్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనున్నాయి. గూగుల్ తన పిక్సెల్ 7 సిరీస్ను కూడా అక్టోబర్లో లాంఛ్ చేయనుంది. ఇక మోటో జీ72 లాంఛ్కు ముందు కంపెనీ కీ స్పెసిఫికేషన్స్ను వెల్లడించింది.
రానున్న స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉండనుంది. ఇంకా సేల్ డేట్ గురించి కంపెనీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మోటో జీ 72 మెటియరైట్ గ్రే, పోలార్ బ్లూ కలర్స్లో రానుంది. మోటో లేటెస్ట్ ఫోన్ ఇన్స్క్రీన్ ఫింగర్ప్రింట్ స్కానర్తో ఐపీ52-రేటెడ్ వాటర్ రెపెల్లెంట్ సపోర్ట్తో కస్టమర్ల ముందుకు రానుంది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే మోటో జీ72 ట్రిపుల్ కెమెరా సిస్టమ్తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 108ఎంపీ ప్రైమరీ కెమెరా, అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు డెడికేటెడ్ మ్యాక్రో కెమెరా కలిగిఉంటుంది.
డాల్బీ అట్మాస్తో కూడిన డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. లేటెస్ట్ మోటో ఫోన్ మీడియాటెక్ హెలియో జీ99 ఎస్ఓసీ చిప్సెట్తో 6జీబీ ర్యాం, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగిఉంటుంది. మోటో జీ72 స్టాక్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్ అవుటాఫ్ ది బాక్స్పై రన్ అవుతుంది. 33డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో పనిచేస్తుంది.