మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు
కరీంనగర్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఉత్త సన్నాసులని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు విమర్శించారు. పెట్రోల్ ధర రోజూ పెరుగుతున్నదని, గ్యాస్ ధర వెయ్యికి పెరిగిందని, హుజూరాబాద్లో ఓట్లు అడిగే బీజేపీ నాయకులు కనీసం గ్యాస్పై సబ్సిడీ ఇప్పించగలుగుతరా అని నిలదీశారు. మంగళవారం హుజూరాబాద్లోమోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ.. ఈటల గెలిచేది సోషల్ మీడియాలోనేనని ఎద్దేవాచేశారు. ఉనుక ఊడ్చినాపాయే తవుడు తాల్చినాపాయె అన్నట్టు దేనికీ పనికిరాని బండి, రేవం త్ ఎగబడి మాట్లాడుతున్నారని, వారికి ప్రజలు కచ్చితంగా వాతలు పెడతారని జోస్యం చెప్పారు. ఈటల కబ్జాకోరని, దళితుల భూములు ఎందుకు వాపస్ ఇవ్వలేదని నిలదీశారు. టీఆర్ఎస్ అభ్యర్థి పేదోడు గెల్లును గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.