సమాజంలో తల్లి పాత్ర ఎంతో గొప్పది. అమ్మ రేపటి భవిష్యత్తు కోసం నిత్యం శ్రమిస్తునే ఉంటుంది.
ఆదివారం మదర్స్ డే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు క్రికెటర్లు తమ తల్లులకు సోషల్మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో పాటు సెహ్వాగ్, రహానె, సురేశ్ రైనా, శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్, విరాట్ కోహ్లీ, క్రిస్గేల్, దినేశ్ చండిమాల్, డేవిడ్ వార్నర్ తదితరులు తమ తల్లులతో ఉన్న తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ బెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా మదర్స్ డే సందర్భంగా ప్రత్యేక వీడియోలు, ఫొటోలతో ట్వీట్లు చేశాయి.