జనగామ : ఆస్తి వివాదం ఓ తల్లి ప్రాణాన్ని బలిగొంది. ఆమె తలను, మొండెం నుంచి వేరు చేశాడు. ఈ దారుణ ఘటన జనగామ మండలం మరిగడి గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కూరాకుల రమణమ్మ(60) కుమారుడు కన్నప్ప ఉన్నాడు. అయితే గత కొద్ది రోజుల నుంచి తల్లీకుమారుడు మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం రాత్రి కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తల్లి తలను కత్తితో నరికేశాడు. అనంతరం మొండెం నుంచి తలను వేరు చేశాడు. ఈ ఘటనతో మరిగడి గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. నిందితుడు కూరాకుల కన్నప్ప జనగామ పీఎస్లో లొంగిపోయినట్లు తెలుస్తోంది.