అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ తల్లి ఇద్దరు పిల్లలకు ఉరేసి తాను ఆత్మహత్యకు పాల్పడడం సంచలనం కలిగించింది. దమ్మలవీధిలో నివాసముంటున్న ధనలక్ష్మి(35) పిల్లలు సోనియా(11) యశ్వంత్(9)కు ముందుగా వారికి ఉరేసి ఆ తరువాత ఆమె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతికి గల కారణాలను కుటుంబసభ్యులు, స్థానికుల నుంచి సేకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మరో సంఘటనలో తమకు పిల్లలు పుట్టడం లేదన్న బాధతో కర్నూలు జిల్లా నందికొట్కూరు పట్టణంలోని ఓ ఇంట్లో ఇద్దరు దంపతులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. వేణు(25), సరస్వతి(22)లకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. ఇప్పటికీ పిల్లలు పుట్టలేదన్న బాధను వ్యక్తం చేసేవారని స్థానికులు తెలిపారు. అన్యోన్యంగా ఉండే దంపతులు కూలిపనులు చేసుకుంటూ బతుకుతుండేవారిని వెల్లడించారు.