అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పొలం పనులకు వెళ్లిన తల్లీకొడుకు విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. జిల్లాలోని వేపాడ మండలం వావిలపాడులో గ్రామంలో ఘటన జరిగింది. సొంత పొలానికి నీళ్లు పారించేందుకు తల్లీకొడుకు పొలం వద్దకు వెళ్లారు. అక్కడ విద్యుత్ మోటర్ ఆన్చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు.
సమీపంలోని రైతులు గమనించి సమాచారం అందించడంతో అక్కడికి వచ్చి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు బోరున విలపించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. తల్లీకొడుకు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.