మెదక్ : జిల్లాలోని హవేళిఘనపూర్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయివేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తల్లీకుమార్తె మృతి చెందగా, మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మెదక్ డీఎస్పీ సైదులు ఆధ్వర్యంలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
మృతదేహాలతో పాటు క్షతగాత్రులను మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మరికొంత మందిని ప్రయివేటు ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రమాదానికి కారణం అతి వేగమే అని పోలీసులు నిర్ధారించారు. బాధితులంతా హైదరాబాద్కు చెందినవారు. వీరంతా అజ్మీర్కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.