ఢిల్లీ ,జూన్ 7: కోవిడ్ పోరులో భాగంగా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యాధి నిర్థారణ పరీక్షలు, సోకినవారి ఆచూకీ కనిపెట్టటం, తగిన చికిత్స అందించటం, వ్యాప్తి నివారణకు తగిన జాగ్రత్తలు పాటించడం, టీకాలివ్వటం వంటి ఐదు అంశాల ప్రాధాన్యంలో భాగంగా టీకాల మీద ప్రత్యేక దృష్టిసారించింది. భారత ప్రభుత్వం దేశవ్యాప్త టీకాల కార్యక్రమానికి అండగా ఉండి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు టీకా డోసులు ఉచితంగా అందిస్తున్నది. అంతే కాకుండా ఉత్పత్తి, సరఫరాను పెంచటానికి అనేక చర్యలు తీసుకుంతున్నది.
మే 1న నుంచి మూడో దశ టీకాల కార్యక్రమాన్ని మరింత వేగంగా అమలు చేస్తున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ప్రతి నెలలో సెంట్రల్ డ్రగ్స్ లేబరేటరీ (సిడిఎల్) ఆమోదించిన ఉత్పత్తి సంస్థలలో తయారైన 50శాతం టీకా మందును కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. రాష్ట్రాలు మిగిలిన 50శాతం కొనుగోలు చేసుకోవచ్చు. ప్రభుత్వం అందించే టీకామందు మునుపటిలాగానే రాష్టాలకు ఉచితంగా పంపిణీ జరుగుతుంది. భారత ప్రభుత్వం ఇప్పటిదాకా రాష్ట్రాలకు, కేంద్రపాలితప్రాంతాలకు 24 కోట్లకు పైగా (24,60,80,900) కోవిడ్ డోసులు ఉచితంగా అందజేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల దగ్గర ఇంకా 1.49 కోట్లకు పైగాటీకా డోసులు అందుబాటులో ఉన్నాయి.