డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పోలీస్ విభాగంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో 2,300 మంది పోలీసులు కరోనా మహమ్మారి బారినపడ్డారు. అయితే వారిలో 93 శాతం మంది అంటే 2,204 మంది ఇప్పటికే వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇక పోలీసుల కుటుంబసభ్యుల్లోనూ 751 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా ఫస్ట్ వేవ్తో పోల్చితే మహమ్మారి బారిన పడిన పోలీస్ల సంఖ్య సెకండ్ వేవ్లోనే ఎక్కువగా ఉన్నది.
కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో 1982 మంది ఉత్తరాఖండ్ పోలీసులకు వైరస్ సోకింది. కానీ సెకండ్ వేవ్లో ఆ సంఖ్య ఇప్పటికే 2,300 దాటింది. ఇక ఉత్తరాఖండ్ అధికార డాటా ప్రకారం దేశంలో గత ఏడాది కరోనా ప్రభావం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరాఖండ్లో 4,364 మంది ఆ వైరస్ బారినపడ్డారు. వారిలో మొత్తం 13 మంది ప్రాణాలు కోల్పోయారు.