భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో ఒకవైపు కరోనా కేసులు కొనసాగుతుండగా మరోవైపు డెంగ్యూ వణికిస్తున్నది. ఇటీవల డెంగ్యూ కేసులు బాగా పెరిగాయి. ఒడిశా రాజధాని భువనేశ్వర్లో వెయ్యికి పైగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. సుమారు 800 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నారు. మరోవైపు డెంగ్యూ వైరస్ మూలాలను తగ్గించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అదనపు కమిషనర్ లక్ష్మీకాంత సేథి తెలిపారు.