కేతేపల్లి: మూసీ ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా శనివారం నీటి విడుదల కొనసాగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 2907.51 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 2 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 1288.60 క్యూసెక్కులు, కాలువలకు 480.04 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 643.45 అడుగులుగా (4.05 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు ఏఈ డి.ఉదయ్కుమార్ తెలిపారు.