కేతేపల్లి: కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు నిలకడగా వస్తున్న ఇన్ఫ్లో ఆదివారం భారీగా పెరిగింది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతా లైన హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇన్ఫ్లో పెరిగింది.
ఎగువ ప్రాంతాల నుంచి 16, 517.57 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు 3, 4, 7, 10, 11 వ నంబరు క్రస్టు గేట్లను ఒక్కో గేటును నాలుగు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
ప్రాజెక్టు 5 క్రస్టు గేట్ల ద్వారా దిగువకు 12, 567.81 క్యూసెక్కులు, కాలువలకు 472.39 క్యూసెక్కుల నీటిని వదులు తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు(4.46 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 642.55 అడుగులుగా (3.83 టీఎంసీలు) నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.