మూసీ ప్రాజెక్టులను విద్యుత్ శాఖా మంత్రి జగదీశ్రెడ్డి మంగళవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రాజెక్టులను నిశితంగా పరిశీలించారు. అధికారులతో కలిసి కలియదిరిగారు. మంత్రి వెంట ఎంపీపీ రవీందర్ రెడ్డి, జడ్పీటీసీ జీడీ భిక్షం, చివ్వెంల జడ్పీటీసీ సంజీవ నాయక్, చివ్వెంల వైస్ ఎంపీపీ జీవన్రెడ్డి, టీఆర్ఎస్ నాయకులున్నారు.