కేతేపల్లి: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి ఆదివారం 1305.13 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగింది. సాంకేతిక లోపంతో కుడి కాలువకు నీటి విడుదలను నిలిపివేశారు. సోమవారం తిరిగి కుడికాలువకు నీటిని విడుదల చేయనున్నారు.
ప్రాజెక్టు రెండు గేట్ల ద్వారా 2426.10 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎడమ కాలువకు 207.89 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 645(4.46 టీఎంసీలు)అడుగులు కాగా ప్రస్తుతం 641.30(3.52 టీఎంసీలు)అడుగులుగా ఉంది.