ముంబయి : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ బెయిల్ పిటిషన్ను పీఎంఎల్ఏ కోర్టు సోమవారం తిరస్కరించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిపై ముంబయి మాజీ పోలీస్ ఉన్నతాధికారి పరమ్ బీర్ సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై విచారణకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం నియమించిన చండిమాల్ కమిషన్ ముందు దేశ్ముఖ్, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి సచిన్ వాజ్ ఇద్దరూ హాజరైన కొద్ది గంటల్లోనే బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. ముంబయి పోలీసు కమిషనర్గా తొలగించిన తర్వాత పరమ్ బీర్ సింగ్ గతేడాది మార్చి 20న ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు. అనిల్ దేశ్ముఖ్ ముంబయిలోని రెస్టారెంట్లు, బార్ల నుంచి ప్రతినెలా రూ.100 కోట్లు వసూలు చేయాలని సచిన్ వాజేను ఆదేశించారని ఆరోపించారు.