Trivikram-maheshbabu movie |సూపర్స్టార్ మహేష్బాబు ప్రస్తుతం సినిమాల వేగాన్ని తగ్గించాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత ఇప్పటి వరకు ఈయన నుంచి మరో సినిమా రాలేదు. ప్రస్తుతం ఈయన ‘సర్కారువారి పాట’ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. పరుశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన కళావతి సాంగ్ 25 మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంది. ఇక ఈయన తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. గతంలో వీళ్ల కాంబోలో తెరకెక్కిన అతడు, ఖలేజా చిత్రాలు క్లాసిక్స్గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
త్రివిక్రమ్ తన సినిమాలలో లీడ్ యాక్టర్లతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయంలోను శ్రద్ద తీసుకుంటుంటాడు. ‘సరిలేరు’లో విజయశాంతి, ‘అలవైకుంఠపురంలో’ టబు, జయరామ్ ఇలా తన సినిమాలలో మంచి పేరున్న నటీనటులను ఎంచుకుంటాడు. మహేష్బాబుతో చేయబోతున్న సినిమాలో త్రివిక్రమ్ ఏకంగా మలయాళ మెగాస్టార్ మోహన్లాల్ ను రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో సీఎం పాత్రకోసం మోహన్లాల్ను సంప్రదించాడట, పాత్ర నచ్చడంతో వెంటనే మోహన్లాల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం .ఇందులో నిజమెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇక మోహన్లాల్ ఇప్పటికే ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారేజ్’లో కీలక పాత్రలో నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు.